Rajnath Singh: రాజ్‌నాథ్ సింగ్ వికారాబాద్ టూర్ షెడ్యూల్‌లో మార్పు

by Prasad Jukanti |   ( Updated:2024-10-15 07:55:20.0  )
Rajnath Singh: రాజ్‌నాథ్ సింగ్ వికారాబాద్ టూర్ షెడ్యూల్‌లో మార్పు
X

దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన హెలికాప్టర్ ద్వారా కాకుండా రోడ్డు మార్గంలో వికారాబాద్‌కు పయనం అయ్యారు. దీంతో పర్యటన కాస్త ఆలస్యం కానున్నది. కాగా ఇవాళ వికారాబాద్ జిల్లా పూడురు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో రాడార్ సెంటర్‌కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. కాగా రాడార్ కేంద్రం శంకుస్థాపనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దామగుండం సమీపంలోని ఉందుర్గు తండా లో పైలాన్ ఏర్పాటు చేశారు. దీన్ని రాజ్ నాథ్ సింగ్ ఆవిష్కరించనున్నారు.

Next Story

Most Viewed