చైతన్య- నారాయణ చదువు పిల్లలను గొర్రెలుగా మార్చడం ప్రారంభించింది!.. ఐపీఎస్ సీవీ ఆనంద్ ఎమోషనల్ ట్వీట్

by Disha Web Desk 5 |
చైతన్య- నారాయణ చదువు పిల్లలను గొర్రెలుగా మార్చడం ప్రారంభించింది!.. ఐపీఎస్ సీవీ ఆనంద్ ఎమోషనల్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఇంటర్ ఫలితాల అనంతరం విద్యార్ధులు ఆత్మహత్య చేసుకొని చనిపోవడంపై ఏసీబీ డైరెక్టర్ జనరల్, ఐపీఎస్ సీవీ ఆనంద్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఫలితాల కారణంగా 7 మంది ఇంటర్మీడియట్ విద్యార్ధుల చనిపోవడానికి కొన్ని కారణాలను చెబుతూ.. విద్యార్ధులు ఒత్తిడి గురి కాకుండా ఉండేందుకు 2001 నీరద రెడ్డి కమిటీ సిఫార్సులను ఎవరు ఆపుతున్నారంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్ కు స్పందించిన ఆయన ఇది చదివితే నా గుండె తరుక్కుపోతుందని అన్నారు. ప్రతిష్టాత్మకమైన తల్లిదండ్రులు, విద్యా వ్యవస్థ యొక్క ఒత్తిడిలో 7 విలువైన జీవితాలు బలి అయ్యాయని ఆవేధన వ్యక్తం చేశారు.

దశాబ్దాల క్రితమే చైతన్య- నారాయణ ప్రవేశపెట్టిన శాపగ్రస్తమైన కార్పొరేట్ చదువు పిల్లలను గొర్రెలుగా మార్చడం ప్రారంభించిందని, ఈ పరీక్షలే జీవితానికి ముగింపు అని భావించవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. జీవితం చాలా పెద్దదని, ఈ గ్రహం మీద ప్రతి ఒక్కరికీ వారి ప్రతిభ ప్రకారం స్థలం ఉందని, దీనికి గణితం మరియు రసాయన శాస్త్రం అవసరం లేదని తెలియజేశారు. తల్లిదండ్రులు విశాల హృదయంతో ఉండి, పిల్లల విశాల వ్యక్తిత్వాలను పెంపొందించుకోవడానికి అనుమతించాలని, నిరాశగా భావించి వారి జీవితాలను ముగించేలా ఒత్తిడి చేయకూడదని సూచించారు. చివరగా చాలా సిగ్గుగా, విచారంగా ఉందంటూ ఎక్స్ వేదికగా తన భావోద్వేగాన్ని వెల్లడించారు.




Next Story

Most Viewed