BRS: మూసీ పేరుతో ప్రజాధనం లూఠీ.. మాజీమంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2024-10-21 12:03:12.0  )
BRS: మూసీ పేరుతో ప్రజాధనం లూఠీ.. మాజీమంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం బిడ్డ పుట్టక ముందే కుల్ల కుట్టినట్లు మాట్లాడుతున్నారని, మిమ్మల్ని చూసి ఊసరవెళ్లి కూడా సిగ్గు పడుతుందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. మూసీ ప్రాజెక్టు బడ్జెట్ పై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా.. మూసీ పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో లక్షా 50వేల కోట్లతో ప్రణాళికలు సిద్దం చేసినట్లు జులై 20వ తేదీన ముఖ్యమంత్రి ప్రకటించారని తెలిపారు. అలాగే సెప్టెంబర్ 6న సీఎం చేతుల మీదుగా విడుదల చేసిన ‘తెలంగాణ గ్రోత్ స్టోరీ ద రోడ్ టు వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ’ విజన్ డాక్యుమెంట్ లోనూ.. లక్షా 50వేల కోట్లు అంటే సుమారు 18 బిలియన్ల డాలర్లతో 5ఏళ్లలో మూసీ రివర్ ఫ్రంట్ రీడెవలప్‌మెంట్ కొరకు ఖర్చు చేస్తున్నట్లుగా పేర్కొన్నారని చెప్పారు.

మొన్న ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. లక్షా 50వేల కోట్లు ఎవరన్నారంటూ ఆవేశంతో ఊగిపోయారని, పూటకో తీరుగా మాట్లాడుతున్న మిమ్మల్ని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుందని అన్నారు. అంతేగాక బిడ్డ పుట్టక ముందే కుల్ల కుట్టినట్లు.. డీపీఆర్ లేకుండా లక్షా 50వేల కోట్లు ఖర్చవుతాయని చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వాలకే చెల్లుతుందని ఎద్దేవా చేశారు. ఇక మూసీ రిజువినేషన్ అండ్ రివర్ ఫ్రంట్ పేరుతో ప్రజాధనం లూఠీ చేయాలనే మీ కుట్రలను బట్టబయలు చేస్తామని, మీ నిరంకుశ విధానాలను అడుగడుగునా ఎండగడతామని, తెలంగాణ ప్రజల తరుపున నిలదీస్తామని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed