BREAKING: అబద్ధాలకు పెట్టింది పేరు కేసీఆర్: పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్

by Disha Web Desk 1 |
BREAKING: అబద్ధాలకు పెట్టింది పేరు కేసీఆర్: పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: అబద్ధాలకు పెట్టింది పేరు కేసీఆర్ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు 9 ఏళ్ల తరువాత కేసీఆర్ నిజస్వరూపం ప్రజలకు తెలిసిందని, ఆయనో కోతలరాయుడు అంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ ప్రసంగంలో ఓ ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా కనిపించిందని తెలిపారు. పార్టీని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఇప్పటికే కొంతమంది బీఆర్ఆర్ నేతలు కూడా తనతో టచ్‌లో ఉన్నారని అన్నారు.

ఆయన ఎన్ని ఫీట్లు చేసినా.. రాష్ట్రంలో ఆ పార్టీని నమ్మే స్థితిలో ప్రజలు లేరని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు వంచనకు గురయ్యారని అన్నారు. రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మను ప్రజలకు మళ్లీ గుర్తు చేసుకుని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని తెలిపారు. సోంత పార్టీ నాయకుల్లోనే కేసీఆర్‌పై ఉన్న నమ్మకం పోయిందని అన్నారు. గతంలో మీడియాను ఆమడదూరం పెట్టే కేసీఆర్.. నిన్న ఓ టీవి ఛానల్ ఇంటర్వ్యూ నాలుగు గంటలు కూర్చున్నారంటే ఆయనకు ఎంత భయం పుట్టుకొచ్చిందో అర్థం అవుతోందని అన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా.. పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ఉండాలని కోరుకునే వ్యక్తిని తాను ఒక్కడినేనని జగ్గారెడ్డి అన్నారు.



Next Story

Most Viewed