BREAKING : రికార్డు మెజార్టీ దిశగా ఈటల..

by Rajesh |   ( Updated:2024-06-04 06:04:24.0  )
BREAKING : రికార్డు మెజార్టీ దిశగా ఈటల..
X

దిశ, మేడ్చల్ బ్యూరో: మల్కాజ్ గిరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఈటెల రాజేందర్ తన హవా కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన లక్షా 27 వేల 843 ఓట్లతో ముందంజలో ఉన్నారు. 10వ రౌండ్ ముగిసే సరికి ఆయనకు మూడు లక్షల 40వేల 988 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డికి రెండు లక్షల 31 వేల 145 ఓట్లు సాధించారు. అయితే 2019 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి 10వేల 919 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా ఈసారి ఆ మార్కు దాటే విధంగా ఈటెల రాజేందర్ దూసుకుపోతున్నారు.

Advertisement

Next Story