BREAKING: ఇద్దరు సీఎంల భేటీ కత్తి మీద సామే : సీపీఐ నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

by Shiva Kumar |
BREAKING: ఇద్దరు సీఎంల భేటీ కత్తి మీద సామే : సీపీఐ నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ పర్యటనను ముగించుని శుక్రవారం సాయంత్రం ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అనంతరం రాత్రి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో బస చేసి శనివారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నారు. ఈ క్రమంలో ఇద్దరు సీఎంల భేటీపై సీపీఐ నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల మఖ్యమంత్రుల భేటీ కత్తి మీద సాములాంటిదని అభివర్ణించారు. ఎక్కడైనా తేడా వస్తేజ.. తెలంగాణ ద్రోహిగా రేవంత్‌ రెడ్డిపై ముద్ర వేసేందుకు ప్రత్యర్థులు రెడీగా ఉన్నారంటూ కామెంట్ చేశారు. అదేవిధంగా రెచ్చగొడితే రెండు రాష్ట్రాల సమస్యలకు పరిష్కారం లభించదని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో కూర్చొని సామరస్యంగా సమస్యలను ఒకటి తరువాత మరొకటి పరిష్కరించుకోవాలని సూచించారు. మరోవైపు అవిష్కృతంగా ఉన్న విభజన సమస్యలు మరింత జఠిలం కాక ముందే ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లాలని అన్నారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య ఏవిధమైన వైశమ్యాలు లేవని, సెంటిమెంట్ తాత్కాలికమేనని నారాయణ స్పష్టం చేశారు.

Next Story

Most Viewed