వైఎస్‌కు రాజకీయ వారసుడు జగన్.. సజ్జల కీలక కామెంట్స్

by srinivas |
వైఎస్‌కు రాజకీయ వారసుడు జగన్.. సజ్జల కీలక కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: దివంగత నేత వైఎస్‌‌కు రాజకీయ వారసుడు జగన్ అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ వైఎస్ ఆశయాల సాధన కోసం ఆయన తనయుడు జగన్ చాలా కృషి చేస్తున్నారని తెలిపారు. జగన్ అధికారంలో ఉండగా ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. కుల, మత, ప్రాంతం, రాజకీయాలకు అతీతంగా పాలన సాగించారన్నారు.


అసాధ్యమైన హామీలు ఇవ్వడం జగన్‌కు తెలియదని చెప్పారు. ప్రజలకిచ్చిన మాటకు జగన్ కట్టుబడి ఉంటారని తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చారన్నారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే తప్పకుండా నిలదీస్తామని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు వచ్చిన వైసీపీ ఊరుకోదని, రోడ్డుపైకి వచ్చి పోరాటం చేస్తుందని సజ్జల వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story