ఆటోను ఢీకొట్టిన లారీ.. ఒకరి మృతి

by karthikeya |   ( Updated:2024-10-06 05:39:38.0  )
ఆటోను ఢీకొట్టిన లారీ.. ఒకరి మృతి
X

దిశ, యాచారం: లారీ ఆటోను ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ శంకర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గోడుకొండ్ల గ్రామ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కాలనీలో నివసించే భాస్కర్ (42) కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. శనివారం కూరగాయలను తీసుకొని గట్టుపల్, అంగడిలో విక్రయించి తిరిగి ఆటోలో స్వగ్రామానికి పయనం కాగా.. పాత మాల్ కూడలి వద్దకు చేరుకోగానే.. మర్రిగూడ వైపు వెళుతున్న లారీ అతివేగంగా ఎదురుగా వచ్చి ఆటోను ఢీకొంది. దీంతో కుడి వైపున కూర్చున్న కూరగాయల భాస్కర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు అతడిని సమీపంలోని పద్మావతి ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలోనే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. భాస్కర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed