BREAKING: బీఆర్ఎస్ గిరిజనులకు తీవ్ర అన్యాయం చేసింది: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హాట్ కామెంట్స్

by Shiva |
BREAKING: బీఆర్ఎస్ గిరిజనులకు తీవ్ర అన్యాయం చేసింది: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్‌కు గిరిజనులకు తీవ్ర అన్యాయం చేసిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డ అన్నారు. ఇవాళ ములుగులో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ తాత్కాలిక భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఎంపీ మాలోతు కవిత పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ములుగులో గిరిజన వర్సిటీ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. పదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గిరిజనులకు పూర్తిగా అన్యాయం చేసిందని ఆరోపించారు. ముఖ్యంగా వర్సిటీకి భూమి ఇవ్వడంలో కేసీఆర్ ప్రభుత్వం జాప్యం చేసిందంటూ మండిపడ్డారు. కొత్త ప్రభుత్వమైనా యూనివర్సిటీకి కనీసం 50 ఎకరాలైన కేటాయించాలని కోరారు. గిరిజన వర్సిటీ, రిజర్వేషన్ల పెంపునకు సీతారాం నాయక్ పోరాటం చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా రూ.60 కోట్లతో రామప్ప దేవాలయాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. రాబోయే వర్సిటీ గిరిజనుల జీవితాల్లో గేమ్ ఛేంజర్‌గా ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూమిని బదలాయిస్తే శాశ్వత నిర్మాణాలు చేపడుతామని కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి అన్నారు.

Advertisement

Next Story

Most Viewed