Breaking: అమిత్ షా.. హైదరాబాద్‌పై ఇంత అక్కసు ఎందుకు: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఘాటు వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-05-03 06:31:28.0  )
Breaking: అమిత్ షా.. హైదరాబాద్‌పై ఇంత అక్కసు ఎందుకు: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం 40 ఏళ్లుగా రజాకార్ల వారసుల కబ్జాలో ఉందంటూ ఇటీవల ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలను ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ మీద అమిత్ షాకు ఇంత అక్కసు ఎందుకో ప్రశ్నించారు. ఎంఐఎం కార్యాలయంతో పాటు తమ మనసులు అన్ని వర్గాల ప్రజల కోసం ఎల్లప్పడూ తెరిచే ఉంటాయని అన్నారు. 40 ఏళ్లుగా హైదరాబాద్ రాజాకర్ల వారసుల చెరలో ఉంటే.. కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా ఏం చేస్తున్నారో చెప్పాలని అన్నారు.

ఇక్కడ రజకార్లెవరూ లేరని.. వారంతా పాకిస్థాన్‌కు పారిపోయారని తెలిపారు. మాటిమాటికి పాతబస్తీపై సర్జికల్ స్టైక్స్ అని, ఐసిస్ అడ్డా, రోహింగ్యాలకు నిలయం అని అవమానిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అసలు మమ్మల్ని ఏం చేద్దామని ఫిక్స్ అయ్యారో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత రాజకీయాలు చేయాలనుకుంటే తన నియోజకవర్గ పరిధిలోని లాల్ దర్వాజ ఆలయ అభివృద్ధికి మజ్లీస్ రూ.20 కోట్ల నిధులు ఎందుకు తీసుకొస్తుందో చెప్పాలన్నారు. అసలు అమిత్ షా హైదరాబాద్‌కు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో ప్రజలెవరూ భయంతో బ్రతకడం లేదని.. అందరూ కలిసిమెలిసే జీవిస్తున్నారని స్పష్టం చేశారు.

Advertisement

Next Story