మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తుండు.. CM రేవంత్ రెడ్డిపై బీజేపీ సంచలన ట్వీట్

by Disha Web Desk 4 |
మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తుండు.. CM రేవంత్ రెడ్డిపై బీజేపీ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని ప్రధాన పార్టీలు ప్రచారంపై ఫోకస్ పెట్టాయి. గ్రౌండ్‌లో దిగి క్యాంపెయినింగ్ స్పీడ్ అప్ చేశాయి. క్యాంపెయినింగ్ తో పాటు సోషల్ మీడియాలో సైతం ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా బీజేపీ సీఎం రేవంత్ రెడ్డిపై ట్విట్టర్ వేదికగా ఫైర్ అయింది.మోకాలికి బోడిగుండుకి సీఎం రేవంత్ ముడిపెడుతున్నాడని మండిపడింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి.. లోక్ సభ ఎన్నికలకు లింక్ పెట్టి, మహిళలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపించింది. సీఎం మాటలు, చేష్టలను ప్రజలు గమనిస్తున్నారు అని ట్వీట్‌లో పేర్కొంది. పథకాల పేరు చెప్పి ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారని.. మహిళల సాధికారత, మహిళల అభివృద్ధిని మరిచి ఉచితాల పేర్లు చెప్పి ఆడపడుచులను బెదిరిస్తావా అని ప్రశ్నించింది. 5 గ్యారంటీలు అమలు చేసినట్లు దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి నిరూపించాలని సవాల్ విసిరింది.



Next Story

Most Viewed