Breaking: ఒంటరిగా ఎన్నికలకు వెళ్తాం.. టీడీపీతో పొత్తుపై తేల్చేసిన బీజేపీ కీలక నేత

by srinivas |
Breaking: ఒంటరిగా ఎన్నికలకు వెళ్తాం.. టీడీపీతో పొత్తుపై తేల్చేసిన బీజేపీ కీలక నేత
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర హోంమంత్రి అమిత్ షాను టీడీపీ అధినేత చంద్రబాబు కలిసిన విషయం తెలిసిందే. అయితే వీరి భేటీలో పొత్తులపై చర్చినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో టీడీపీ సహాయం తీసుకోవాలనే చర్చ ఇద్దరి మధ్య వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. కానీ తెలంగాణలో టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకోబోతున్నాయనే ప్రచారం జోరందుకుంది.


ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి స్పందించారు. టీడీపీ, బీజేపీ పొత్తుతో వచ్చే ఎన్నికలకు వెళ్తారనే ప్రచారాన్ని ఖండించారు. తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. తెలంగాణలో ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. టీడీపీతో కలవడం వల్ల వచ్చేదేమి లేదని కొట్టిపారేశారు. టీడీపీ ఓట్లు తమకు అవసరం లేదని.. ఆ పార్టీతో పొత్తు వద్దని ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story