ఫాంహౌజ్ కేసుపై BL సంతోష్ రియాక్షన్ ఇదే

by GSrikanth |   ( Updated:2022-12-29 13:24:47.0  )
ఫాంహౌజ్ కేసుపై BL సంతోష్ రియాక్షన్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: మొయినాబాద్ ఫాంహౌజ్‌లో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఎల్ సంతోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఆరోపణలు చేసిన వారు పర్యావసనాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. శామీర్‌పేట లియోనియా రిసార్ట్స్‌లో నిర్వహించిన పార్లమెంట్ విస్తారక్ సమావేశాల్లో పలువురితో ఆయన అంతర్గతంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీఎల్ సంతోష్ మొదటిసారి హాంహౌజ్ కేసుపై స్పందించారు. తనపై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉందని పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేసినవాళ్లు పర్యవాసనాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం, నాయకులు ప్రజాస్వామ్యానికి శాపంగా మారారని ఘాటుగా విమర్శలు చేశారు. తాను ఎవరనేది ఇక్కడ ఎవరికీ తెలియదని, అలాంటిది తెలంగాణలో ప్రతీ ఇంటికీ తన పేరును తీసుకెళ్లారని వెల్లడించారు. తెలంగాణ తల్లి పేరుతో ఆమెకే ద్రోహం చేశారని సంతోష్ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా గతంలో ఎప్పుడూ లేనిది సంతోష్​ఇంత ఘాటుగా స్పందించడం సంచలనంగా మారింది.

Also Read...

పార్టీ మార్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత క్లారిటీ (వీడియో)

Advertisement

Next Story

Most Viewed