- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
BRSకు బిగ్ షాక్.. కాంగ్రెస్లోకి కారు పార్టీ కార్పొరేటర్లు, నాయకులు
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ అర్బన్కు చెందిన బీఆర్ఎస్ నాయకులు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం ఉదయం హైదరాబాద్లో మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, నిజామాబాద్ అర్బన్ ఇన్చార్జి మొహమ్మద్ షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ అర్బన్కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆకుల లలిత, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవ వేణు, నరాల రత్నాకర్, తహర్బిన్ హందాన్ ఆధ్వర్యంలో అర్బన్ బీఆర్ఎస్ నాయకులు పార్టీలో చేరారు.
కాంగ్రెస్లో చేరిన వారిలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు పంచ రెడ్డి నర్సు బాయ్ సురేష్, మృదుల అరుణ్ కుమార్లతోపాటు బీఆర్ఎస్ నాయకులు కొండపాక రాజేష్, బొబ్బిలి మురళి, పోతుల పురుషోత్తం, పుప్పాల రవి, నైని సృజన్, మాకు రవి, మార ప్రభు, బిఎల్ రాజు, పసుల సురేష్లు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని తెలంగాణ అభివృద్ధి చెందుతుందని గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి గెలిపించారని అన్నారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాలను గెలిచి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీకి కృతజ్ఞత తెలుపుతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి మరింత వలసలు పెరుగుతాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసే వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందని షబ్బీర్ అలీ అన్నారు.