BIG News: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. మూడు కమిటీలకు చైర్మన్ల నియామకం

by Shiva |   ( Updated:2024-09-09 13:51:03.0  )
BIG News: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. మూడు కమిటీలకు చైర్మన్ల నియామకం
X

దిశ, వెబ్‌డెస్క్: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ శాసనసభ మొత్తం మూడు ఆర్థిక కమిటీలను (పబ్లిక్ అకౌంట్స్, ఎస్టిమేషన్, పబ్లిక్ అండర్‌ టేకింగ్ కమిటీలు) ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నియమితులయ్యారు. ఎస్టిమేషన్ కమిటీకి చైర్ పర్సన్‌గా కోదాడ ఎమ్మెల్యే నల్లమాద పద్మావతి రెడ్డి ఎంపికయ్యారు. ఇక పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీకి చైర్మన్‌గా షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నియమితులయ్యారు. అన్ని కమిటీల్లోనూ మొత్తం 12 మంది చొప్పుల సభ్యులు ఉండనున్నారు.

Advertisement

Next Story

Most Viewed