- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎక్స్ ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్ పాస్ దారులకు ఆర్టీసీ భారీ శుభవార్త
దిశ, వెబ్డెస్క్: ఎక్స్ ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్ పాస్ దారులకు తెలంగాణ ఆర్టీసీ భారీ శుభవార్త తెలిపింది. ఈ పాస్ కలిగి ఉన్న వారు ఇప్పటి వరకు కేవలం ఎక్స్ ప్రెస్, అర్డినరి బస్సుల్లో మాత్రమే ప్రయాణించడానికి వీలుండేది. తాజాగా ఆర్టీసీ ఈ పాస్ కలిగి ఉన్న వారు డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును కల్పించింది. రూ.20 కాంబినేషన్ టికెట్ తీసుకుని డీలక్స్ బస్సుల్లో వారు ప్రయాణించవచ్చు. ఎక్స్ ప్రెస్ పాస్ దారులకు మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. కాగా ఈ కాంబినేషన్ టికెట్ సదుపాయాన్ని వినియోగించుకుని డీలక్స్ బస్సుల్లో ప్రయాణించాలని సంస్థ కోరుతోంది. 100 కిలోమీటర్ల పరిధిలో జారీ చేసే ఈ పాస్ కావాలనుకునే వారు టీఎస్ఆర్టీసీకి చెందిన స్థానిక బస్ పాస్ కౌంటర్లను సంప్రదించాలని సూచించారు. తాజా నిర్ణయంతో మంత్లీ పాస్ వాడే వారికి భారీ ఉపశమనం కలిగినట్లైంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫ్రీ బస్ వల్ల ఎక్స్ ప్రేస్ బస్సుల్లో నిలబడటానికి కూడా చోటు దొరకడం లేదు.