BIG BREAKING: 45 ఏళ్ల పొలిటికల్ కెరీర్‌లో అవమానాలు ఎదుర్కొన్నా: మంత్రి తుమ్మల భావోద్వేగపూరిత వ్యాఖ్యలు

by Shiva |
BIG BREAKING: 45 ఏళ్ల పొలిటికల్ కెరీర్‌లో అవమానాలు ఎదుర్కొన్నా: మంత్రి తుమ్మల భావోద్వేగపూరిత వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యల పట్ల ఆయన ఆవేదన చెందుతూ.. ఇవాళ ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. ఆ శ్రీరాముడు, ఖమ్మం జిల్లా ప్రజల దయతోనే తాను ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు. ఎన్టీఆర్ కాలం నుంచి మంత్రిగా ఉంటూ జిల్లాకు మేలు చేసేందుకే ప్రయత్నించానని అన్నారు. ఖమ్మం జిల్లా నుంచే గోదావరి పారుతున్నా.. ఆ జలాలు ఈ నేలను తడుపలేదన్నారు. మొదటి నంచి జిల్లాలో మొత్తం భూమికి నీళ్లు ఇవ్వాలన్నదే తన సంకల్పమని పేర్కొన్నారు. మంత్రిగా ఉన్న ప్రతిసారి ముఖ్యమంత్రులతో మాట్లాడి తన ప్రయత్నాలు తాను చేశానని గుర్తు చేశారు. సత్తుపల్లి, జూలూరుపాడు, వేలేరు ప్రాంతాలకు కూడా నీళ్లు ఇవ్వాలంటూ ప్రాధేయపడిన సంఘటన కూడా ఉన్నాయని తెలిపారు.

ఖమ్మం జిల్లా రైతాంగాన్ని దృష్టిలో పెటుకుని నీళ్ల కోసం గతంలో పార్టీ మారానని క్లారిటీ ఇచ్చారు. కానీ, గత ప్రభుత్వం జిల్లాలో తలపెట్టిన ప్రాజెక్టుల పనులను పట్టించుకోలేదని ఆరోపించారు. రాహుల్ గాంధీ కోరిక మేరకు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరానని గుర్తు చేశారు. కాంగ్రెస్‌లోకి వచ్చేటప్పుడు కూడా ప్రాజెక్టులు పూర్తి చేయాలంటూ అధిష్టానానికి తెలిపానని అన్నారు. అనంతరం మంత్రి కాగానే సత్తుపల్లి టన్నెల్‌ పనులు ప్రారంభించానని అన్నారు. సీతారామ ప్రాజెక్ట్ విషయంలో క్రెడిట్ కోసం తాను ప్రయత్నిస్తున్నాని హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయంటూ ఎమోషనల్ అయ్యారు. తాను క్రెడిట్ కోసం తాపత్రయ పడే వ్యక్తి కాదని మంత్రి తుమ్మల బదులిచ్చారు. అంతిమంగా జిల్లాకు నీరివ్వాలన్నాదే తన లక్ష్యమని, కీర్తి, ప్రతిష్టల కోసం ఆరాటపడే మనిషిని కాదంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రజలకు చేసిన మంచి ఫ్లెక్సీల్లో కాదు.. పనుల్లో కనపడాలని తుమ్మల అన్నారు.

Advertisement

Next Story

Most Viewed