Bandi Sanjay : కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్ దాఖలు

by Disha Web Desk 12 |
Bandi Sanjay :  కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్ దాఖలు
X

దిశ, బ్యూరో కరీంనగర్ : కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ముందు మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం తల్లి పాదాబివందనం చేసి బీజేపీ కార్యకర్తలతో బారి కాన్వాయ్‌లో కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి‌లతో కలసి నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ అందజేశారు. అనంతరం నగరంలో బారి ద్వీచక్ర వాహన ర్యాలి ప్రారంబించి ర్యాలీ‌లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్ భాయ్ పటేల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు.



Next Story

Most Viewed