KCR నమ్మించి గొంతు కోసే రకం: బండి సంజయ్

by Disha Web Desk 2 |
KCR నమ్మించి గొంతు కోసే రకం: బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ నమ్మించి గొంతు కోసే రకం అని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల వేళ కేవలం ఓట్లు దండుకునేందుకే మరోసారి డ్రామాలు ఆడుతున్నారని సెటైర్ వేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారాన్ని ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. పదేళ్ల పాటు కేసీఆర్ చేసిన మోసాలను ప్రజలు గుర్తుపెట్టుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ ఢిల్లీకి కప్పం కడుతోందని ఆరోపించారు. ఎన్నికల్లో గొప్పగా హామీలు గుప్పించి ఇప్పుడు అమలు చేసేందుకు డబ్బులు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు జనం బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

Read More...

తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలే.. KCR సెన్సేషనల్ కామెంట్స్

Next Story

Most Viewed

    null