కేసీఆర్ యాగం, హైడ్రాపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
కేసీఆర్ యాగం, హైడ్రాపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్, బీఆఆర్ఎస్‌లప కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు, కుమార్తె కవిత లిక్కర్ కేసు నుంచి బయటపడేందుకు కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో యాగాలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఫ్యామిలీకి నో ఎంట్రీ బోర్డు పెట్టారని.. ఆ విషయం వారికి అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. మరోవైపు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని అన్నారు. హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే హైడ్రాతో అమాయకులకు సంబంధించిన చిన్న చిన్న కట్టడాలు కూల్చివేస్తూ హైడ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే.. ఒవైసీ ఫాతిమా కాలేజీలను కూల్చాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ కేడర్ ఫోకస్ పెట్టాలని సూచించారు. పార్టీలో కష్టపడ్డ వారికే టికెట్లు వస్తాయని అన్నారు.

Advertisement

Next Story