Dattatreya: అలయ్ బలయ్ కార్యక్రమానికి రండి.. స్పీకర్ కు దత్తన్న ఆహ్వానం

by Prasad Jukanti |
Dattatreya: అలయ్ బలయ్ కార్యక్రమానికి రండి.. స్పీకర్ కు దత్తన్న ఆహ్వానం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కలిశారు. వచ్చే నెల 13న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగే అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ భేటీలో దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి కూడా ఉన్నారు. ప్రతియేటా దసరా పండగ అనంతరం రాజకీయ పార్టీలకు, మతాలకు అతీతంగా అందరినీ అలయ్ బలయ్ పేరుతో ఒకే వేదికమీదకు తీసుకువస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని దత్తాత్రేయ, ఆయన కుటుంబ సభ్యులు చాలా ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవలే ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దత్తాత్రేయ కలిసి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed