- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ప్రియురాలి కోసమే బీటెక్ విద్యార్థి హత్య
దిశ, వెబ్ డెస్క్ : గురువారం బాలాపూర్లో జరిగిన విద్యార్థి హత్య కేసులో సంచలన విషయలు బయటికి వచ్చాయి. మృతుడు ప్రశాంత్ తన ప్రియురాలిని వేధించడం వల్లే హత్య చేశానని ప్రధాన నిందితుడు మాధవ్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. ప్రశాంత్ రోజూ తన ప్రియురాలికి ఫోన్ కాల్స్, అసభ్య మెసేజెస్ చేసేవాడని.. అందుకే కోపంతో తనని చంపాలని, తన స్నేహితుల సహాయం తీసుకున్నాని తెలిపాడు. ముందుగానే ప్రశాంత్ ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో రెక్కీ నిర్వహించామని తెలిపారు. గురువారం సాయంత్రం ఒక్కడే బయటకు వెళ్ళడం చూసి, కావాలని గొడవ పెట్టుకొని హత్య చేశామని పోలీసుల ఎదుట నిందితులు ఒప్పుకున్నారు.
గురువారం బాలాపూర్ గణేష్ చౌక్ వద్ద మండి @37 అరేబియన్ బిర్యాని సెంటర్ గేట్ఆవరణలోని ఓ పాన్షాప్కి ప్రశాంత్ తన ముగ్గురి స్నేహితులతో సిగరెట్కోసం వచ్చాడు. సిగరెట్తాగుతుండగా ప్రశాంత్ వెంట వచ్చిన ముగ్గురిలో మాధవ్ తో గొడవ జరిగింది. మాటా మాటా పెరగడంతో వెంటనే మాధవ్ కత్తితో అందరూ చూస్తుండగానే ప్రశాంత్ ను అతి కిరాతకంగా హత్య చేశాడు. ప్రశాంత్ మృతి చెందగానే మిగతవాళ్ళు అక్కడి నుంచి బైక్ పై పరారయ్యారు. బిర్యాని సెంటర్నిర్వాహకుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతుని వద్ద లభించిన హాల్టికెట్, ఓటర్ కార్డు ఆధారంగా వివరాలు సేకరించారు. ప్రశాంత్, అతని తల్లితో కలిసి గత కొంత కాలంగా బాలాపూర్లో నివాసముంటూ, నాదర్గూల్లోని ఎంవీఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాలలో బీఈ సివిల్స్ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రశాంత్ ఫోన్ కాల్స్ ఆధారంగా.. శుక్రవారం ఉదయం నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు.