Eatala : కుట్రలో భాగమే దేవాలయాలపై దాడులు..! ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh N |
Eatala : కుట్రలో భాగమే దేవాలయాలపై దాడులు..! ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని మోడీ పాలనలో 11 వ ఏడాదిలోకి వచ్చామని, బాంబుల మోతలేని పాలన అందించారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. తాజాగా ఆయన నేరెడ్మెట్ పరిధిలోని ఈస్ట్ ఆనంద్ బాగ్‌లో బీజేపీ సభ్యత్వం నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోడీ శాంతిని నెలకొల్పారని, భారతదేశం సురక్షితంగా, సుభిక్షంగా ఉందన్నారు. కానీ దాన్ని దెబ్బతీయడానికి హైదరాబాద్‌లో అశాంతిని నెలకొల్పడానికి కొంతమంది కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అందులో భాగమే మన దేవాలయాల మీద దాడులు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఓట్ల కోసం సీట్ల కోసం ఇలాంటి వారిని పెంచి పోషిస్తే.. పాముకు పాలు పోసి పెంచుకున్నట్టే అని ఇక్కడ పాలకులు మర్చిపోవద్దన్నారు. ఉన్మాదానికి కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేదన్నారు. వారికి మానవత్వం ఉండదని, అమాయకులు బలి అవుతారన్నారు. అనేక దేశాల్లో కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది ఈ ఉన్మాదం అని, మనందరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయకుండా దీనికి అడ్డుకట్ట వేయాలన్నారు. లేదంటే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావలసి వస్తుందని తెలిపారు. దేశం సురక్షితంగా ఉంచడమే మోడీ కర్తవ్యమని, మీరందరూ బీజేపీలో చేరినందుకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed