APGVB : తెలంగాణ వరద బాధితులకు ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ భారీ విరాళం

by Ramesh N |
APGVB : తెలంగాణ వరద బాధితులకు ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ భారీ విరాళం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ వరద బాధితుల సహాయం కోసం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు సిబ్బంది ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 65 లక్షలు విరాళంగా అందించారు. బ్యాంకు చైర్మన్ కె. ప్రతాప రెడ్డి బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మక్కడ్ చైర్మన్ సెక్రటరీ ఆర్. యశ్వంత్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో స్పందించి ప్రభుత్వానికి అండగా తమ వంతు చేయూతను అందించిన ఏపీజీవీబీ కార్యవర్గానికి, సిబ్బందికి ఈ సందర్భంగా సీఎం ధన్యవాదాలు తెలియజేశారు.

కాగా, తెలంగాణలో ఇటీవల వర్షాల కారణంగా వచ్చిన వరదల వల్ల పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. దీంతో వరద బాధితులను ఆదుకోవడం కోసం తోచినంత సహాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు సెలబ్రిటీలు, పలు కంపెనీలు, ఉద్యోగులు, ప్రజలు, నేతలు భారీగా సీఎం రిలీఫ్ ఫండ్‌‌కు నిధులు అందజేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed