Ponnam Prabhakar : ఏ పార్టీ వారైనా.. చెరువుల ఆక్రమణపై సమాచారం ఇవ్వండి: పొన్నం కీలక వ్యాఖ్యలు

by Ramesh N |   ( Updated:2024-08-24 13:27:03.0  )
Ponnam Prabhakar : ఏ పార్టీ వారైనా.. చెరువుల ఆక్రమణపై సమాచారం ఇవ్వండి: పొన్నం కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణపై సమాచారం ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. ప్రకృతి, పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యయానే సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే దానిని ప్రభుత్వ దృష్టికి తీసుకురండని ప్రకటించారు.

రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని, ఎంత పెద్ద వాళ్ళు ఉన్న చెరువులు, కుంటలు ఆక్రమణకు గురైతే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి చర్యలు తీసుకుంటారని సూచించారు. ఈరోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్ తరాలకు ఇచ్చే వరం ఇదన్నారు. మీ ప్రాంతంలో ఎక్కడ ఆర్టీఏ ద్వారా తీసుకున్న పూర్వీకుల దగ్గర నుంచి వచ్చిన వారసత్వపు చెరువులు ఎక్కడెక్కడ ఉన్నయో చెరువులు ఆక్రమణకు గురైతే ఎంత పెద్ద వారైనా ఏ పార్టీ వారైనా సమాచారాన్ని ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.

ముఖ్యంగా హైదరాబాద్ ఇంచార్జి మంత్రిగా హైదరాబాద్ చెరువుల పరిరక్షణకు జరుగుతున్న కార్యక్రమంలో జంట నగరాల్లో హైదరాబాద్, రంగారెడ్డి ప్రజలు ప్రకృతిని భవిష్యత్ తరానికి చెరువులను కాపాడుకోవడానికి ఈ ప్రక్రియలో స్వచ్చందంగా మీ ప్రాంతంలోని చెరువులను రక్షించుకోవడానికి ముందుకు రావాలన్నారు. ప్రభుత్వం ఎవరి మీద కక్ష పూరితంగా, వ్యక్తిగతంగా ఉద్దేశ్య పూర్వకంగా వ్యక్తుల మీద పార్టీల మీద జరుగుతున్న పోరాటం కాదన్నారు. ప్రభుత్వం పరివర్తన తేవాలని చేస్తున్న చర్య అని, తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలనలో తీసుకున్న చర్య అని, ఎక్కడెక్కడైతే చెరువుల ఆక్రమణకు గురయ్యాయో అక్కడ సమాచారం ఇవ్వాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed