బెల్లంపల్లిలో రెచ్చిపోయిన దొంగలు.. ఒకేసారి ఐదు దుకాణాల్లో చోరీ

by Kavitha |
బెల్లంపల్లిలో రెచ్చిపోయిన దొంగలు.. ఒకేసారి ఐదు దుకాణాల్లో చోరీ
X

దిశ, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రధాన మార్కెట్లో దొంగతనం సంఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

పట్టణం నడిబొడ్డున ఉన్న వ్యాపార దుకాణ సముదాయాల్లోని ఐదు దుకాణాల్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆదివారం తెల్లవారుజామున పట్టణంలోని రెండు కిరాణా దుకాణాలు, పండిత్ మెడికల్ షాపు, తిలక్ ఫోటో స్టూడియో, బాలాజీ ఎలక్ట్రికల్ షాప్‌లో తలుపులు పగలగొట్టి దొంగలు చోరీకి తెగబడ్డారు. మెయిన్ మార్కెట్లో ఏకకాలంలో ఐదు దుకాణాల్లో చోరీ జరగడం సంచలనాన్ని రేకెత్తిస్తున్నది. ఈ సంఘటనతో వ్యాపార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ ఘటనలో దుండగులు కెమెరాలు, నగదును ఎత్తుకెళ్ళినట్లు ప్రాథమిక సమాచారం. కాగా సంఘటన పూర్వపరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చోరీకి పాల్పడిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటన స్థలాన్ని బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ దేవయ్య సందర్శించారు. క్లూస్ టీం రంగంలో దిగి వివరాలు సేకరిస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed