- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
Pranahita river : గల్లంతైన యువకుల కోసం గజ ఈతగాళ్లలో వెతికించండి
దిశ, బెజ్జూర్ : బెజ్జుర్ మండలం సోమిని ఎర్రబండ (Somini errabanda)ప్రాంతంలో ఈతకు వెళ్లి యువకులు గల్లంతైన ప్రాంతాన్ని ఎమ్మెల్సీ దండే విఠల్ పరిశీలించారు. ముగ్గురు యువకుల్లో ఒకరైన జాహీర్ మృతదేహం తలాయి ప్రాంతంలో లభ్యంకాగా మరో ఇద్దరి కోసం గజ ఈతగాళ్లతో వెతికించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆదివారం బెజ్జూరు మండలం సోమిని ప్రాణహిత రేవు(Pranahita Revu)ను ఆయన పరిశీలించారు.
ప్రమాదానికి గల కారణాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ప్రాణహితలో గల్లంతైన ముగ్గురు యువకుల కుటుంబాలను ఆయన పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట బెజ్జూర్ మండల తాజా మాజీ జెడ్పీటీసీ పంద్రం పుస్పలత, చింతలమనేపల్లి తాజా మాజీ ఎంపీపీ డబ్బుల నానయ్య, టీపీసీసీ సభ్యులు ఆర్షద్ హుస్సేన్, పీఏసీఎస్ చైర్మన్ కుర్సింగా ఓం ప్రకాశ్, డైరెక్టర్ రాచకొండ శ్రీ వర్దన్, నాయకులు నహీర్ అలీ, రేణుకుంట్ల పెంటయ్య, రంగు సురేష్ గౌడ్, ఇగురపు వెంకటి, సంజీవ్ తదితరులు ఉన్నారు.
- Tags
- Pranahita river