ఎక్కడి వారు అక్కడే.. సిగ్నల్ లేక అల్లాడిపోయిన ప్రజలు...

by Sumithra |
ఎక్కడి వారు అక్కడే.. సిగ్నల్ లేక అల్లాడిపోయిన ప్రజలు...
X

దిశ, భైంసా : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం కొన్ని కంపెనీలకు చెందిన మొబైల్ సిమ్ సిగ్నల్స్ పని చేయకపోవడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా జనాలు ఎక్కడి వారు అక్కడే స్ట్రక్ అయ్యారు. దీంతో సిగ్నల్స్ పని చేసే సిమ్ వున్న వ్యక్తుల వద్దకు వెళ్లి అన్న మీ సెల్ కొద్దిగా ఇస్తారా..! మా వాళ్ళకి కాల్ చేసుకోవాలి అంటూ అడిగారు. సిగ్నల్ వున్న వారి హాట్ స్పాట్ కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. కొద్ది సమయానికి సిగ్నల్స్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. వామ్మో సిగ్నల్స్ లెకపోతే ఎంత కష్టమో అంటూ.. పలువురు అనుకుంటున్నారు.

Advertisement

Next Story