ఆదిలాబాద్‌లో రెండో రోజు ఒకటే నామినేషన్..

by Disha Web Desk 23 |
ఆదిలాబాద్‌లో రెండో రోజు ఒకటే నామినేషన్..
X

దిశ,ఆదిలాబాద్ : 2024 లోక్ సభ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా శుక్రవారం అదిలాబాద్ పార్లమెంట్ నియోజక వర్గానికి సంబంధించి రెండవ రోజు ఒక నామినేషన్ దాఖలయినట్లు ఆదిలాబాద్ జిల్లా రిటర్నింగ్ అధికారి రాజర్షి షా తెలిపారు. కలెక్టర్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన ఆర్.ఓ. కార్యాలయం లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ తరపున ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్,కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ఇంఛార్జి కంది శ్రీ‌నివాస్ రెడ్డి, బోథ్ ఇంఛార్జి ఆడె గ‌జేంద‌ర్, సీనియర్ పాత్రికేయులు కరీం,కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆదివాసి శ్రీలేఖ లు ఒక కాపీ నామినేషన్ దాఖలు చేశారని పేర్కొన్నారు.

Next Story

Most Viewed