కోర్టులో ఎమ్మెల్యే కోవ లక్ష్మికి ఊరట

by Sridhar Babu |
కోర్టులో ఎమ్మెల్యే కోవ లక్ష్మికి ఊరట
X

దిశ, ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మికి కోర్టులో ఊరట లభించింది. కోర్టులో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఎన్నికల సందర్భంగా దాఖలైన పిటిషన్ ను శుక్రవారం రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. కోవలక్ష్మి ఎన్నికల అఫిడవిట్ లో ఆదాయపన్ను లెక్కలు తప్పులు ఉన్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి శ్యాం నాయక్ కోర్టుకెక్కారు.

2023 ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు ప్రచారం ఇచ్చారని, ఆమె ఎన్నిక చెల్లిందని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోవలక్ష్మి 2023 ఎన్నికల్లో మోసపూరితంగా గెలిచారని పిటిషన్ వేశారు. గత 9 నెలల నుంచి కొనసాగుతున్న ఈ కేసు శుక్రవారం విచారణకు రాగా ఎన్నికల అఫిడవిట్ లో చూపించిన ఆదాయపన్ను లెక్కలు సరిగ్గానే ఉన్నాయని కేసు కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు.

Advertisement

Next Story