క్రీడలతో మానసిక ఉల్లాసం

by Sridhar Babu |
క్రీడలతో మానసిక ఉల్లాసం
X

దిశ, ఆసిఫాబాద్ : క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని గిరిజన గురుకుల క్రీడా పాఠశాల మైదానంలో అటవీ శాఖ ఉద్యోగులకు నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడా పోటీలను అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, డీఎఫ్ ఓ నిరజ్ కుమార్, ఎఫ్టీఓ సుశాంత్ సుఖదేవ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగంలో బిజీగా ఉన్న వారికి క్రీడలతో కొంత మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలగడంతో పాటు ఉల్లాసాన్ని కలగజేస్తుందన్నారు. రాష్ట్రస్థాయిలో విజయం సాధించి జిల్లాకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ పోటీల్లో దాదాపు 200 మంది వివిధ స్థాయిల అటవీ ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed