పోలీస్ అమరవీరులను స్మరించుకుందాం

by Sridhar Babu |
పోలీస్ అమరవీరులను స్మరించుకుందాం
X

దిశ, ఆసిఫాబాద్ : శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన పోలీస్ అమరవీరులను స్మరించుకుందామని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం 7 గంటలకు జిల్లాలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద వివిధ సంఘటనల్లో అమరులైన పోలీసులకు శ్రద్ధాంజలి ఘటించడంతో పాటు శోక్ శ్రస్త్ పరేడ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. దీనికి జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని పోలీస్ అమరవీరులకు నివాళులర్పించనున్నట్లు తెలిపారు. అనంతరం పోలీస్ కవాతు ఉంటుందని, ప్రజలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Advertisement

Next Story