రాథోడ్ రమేష్ మృతికి మాజీ ఎంపీ, మాజీ మంత్రి సంతాపం..

by Sumithra |
రాథోడ్ రమేష్ మృతికి మాజీ ఎంపీ, మాజీ మంత్రి సంతాపం..
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేష్ రాథోడ్ అకాల మరణం పట్ల మాజీ పార్లమెంట్ సభ్యులు సోయం బాపూరావు, మాజీ మంత్రి జోగు రామన్నలు శనివారం ప్రగాఢ సంతాపం తెలిపారు. మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ కన్ను ముషారన్న విషయం తెలిసి ఢిల్లీ నుండి సోయం బాపురావు సంతాపం తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నారని అన్నారు. సామాన్య పేద వర్గాల ప్రజల కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తిగా రాథోడ్ రమేష్ పేరు సంపాదించారని గుర్తు చేశారు. రాథోడ్ రమేష్, అకాల మరణం జిల్లాకు తీరని లోటని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసినట్లు పేర్కొన్నారు.

అటు మాజీ మంత్రి జోగురామన్న, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి జిల్లాకే ఎంతో గుర్తింపు తీసుకువచ్చారని అన్నారు. గతంలో ఒకటే పార్టీలో కలిసి పనిచేశామని, ఉమ్మడి జిల్లా రాజకీయ పదవుల్లో ప్రజలకు ఎంతో సేవ చేసిన ఆయన అకాల మరణం బాధను కలిగించిందని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Next Story