భైంసా పట్టణంలో కార్డెన్ సెర్చ్..

by Sumithra |
భైంసా పట్టణంలో కార్డెన్ సెర్చ్..
X

దిశ, భైంసా : భైంసా పట్టణంలోని పూలే నగర్ ఏరియాలో శుక్రవారం ఉదయం ఎస్పీ ఆదేశాల మేరకు డివిజన్ ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకే తరచూ ఇలాంటి తనిఖీలు చేపడతామని, రోడ్డు భద్రత నియమాలను తప్పకుండా పాటించాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 102 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 4 కార్లు, 2 ఇసుక ట్రాక్టర్లు, ఇలా మొత్తం 110 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో సీఐ రాజారెడ్డి, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed