Bhainsa ASP :నిమజ్జనోత్సవం శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి

by Aamani |
Bhainsa ASP :నిమజ్జనోత్సవం శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి
X

దిశ, ముధోల్ : శాంతియుత వాతావరణంలో పండుగలు, వినాయక నిమజ్జనోత్సవ వేడుకలు జరుపుకోవాలని బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ అన్నారు.ముధోల్ లో సోమవారం గణేష్ మండప నిర్వహకులు,హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులతో జిఎం గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో హాజరై మాట్లాడారు...అన్ని కులాలు,మతాలు సమన్వయం తో పోలీస్ అధికారుల నిబంధనలను ఉల్లంఘించకుండా నిమజ్జనోత్సవ వేడుకను జరుపుకోవాలని కోరారు.

మండప వద్ద విద్యుత్ తీగలతో జాగ్రత్తగా ఉండాలని అవసరమైతే సంబంధిత అధికారుల సహాయం తీసుకోవాలని అన్నారు.,పండగలో ఆనందం ఉండాలి కానీ దుఃఖాన్ని మిగల్చవద్దని అన్నారు.ఈ కార్యక్రమంలో సీఐ మల్లేష్,ఎస్ ఐ సాయి కిరణ్.తహసీల్దార్ శ్రీకాంత్, ట్రాన్స్ కో ఏఈ శ్రీకాంత్, ఎంపీడీఓ శివ కుమార్,ఏవో ప్రసాద్ గౌడ్,ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రోళ్ల రమేష్, గౌరవ అధ్యక్షుడు సుదర్శన్, ఉపాధ్యక్షులు కోరి పోతన్న,టి రమేష్, కోశాధికారి సాయినాథ్, విడిసి అధ్యక్షుడు జి.నారాయణ, నాయకులు ,మండప నిర్వహకులు తదితరులుపాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed