భైంసా ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన ఆనంద్ రావ్ పటేల్, ఫారుక్ హైమద్

by Sumithra |
భైంసా ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన ఆనంద్ రావ్ పటేల్, ఫారుక్ హైమద్
X

దిశ, భైంసా : బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, పలువురు సభ్యులు గురువారం మార్కెటింగ్ అధికారుల సమక్షంలో ఛార్జ్ తీసుకొని సంతకం చేశారు. ఛైర్మెన్ గా మాంజ్రి గ్రామానికి చెందిన సిందే ఆనంద్ రావు పటేల్, వైస్ చైర్మన్ గా ఎండీ ఫారుక్ హైమద్ సంతకాలు చేశారు. త్వరలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క సమయం తీసుకొని పెద్ద మొత్తంలో ప్రమాణ స్వీకార కార్యక్రమ ఉత్సవాన్ని సైతం రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో జరుపుకుంటామని చైర్మన్ పేర్కొన్నారు.

మెంబర్స్ (డైరెక్టర్స్) గా డి.రామేశ్వర్, నడిమిశెట్టి భూమన్న, షేక్ మౌలామియా, తోట రాము, రాథోడ్ రామ్నాథ్, జాదవ్ సురేఖ, గడపాలె దేవిదాస్, సట్ల కిష్టన్న, మాధవరావు, సుధాకర్ రావ్, కుంటోళ్ల విట్టల్, కదం దత్తురాం పటేల్ ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ఆనంద్ రావ్ పటేల్ దాదాపు గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీనీ అంటిపెట్టుకొని, ఎన్నో ఏళ్ళు గా పార్టీకి చేశారు. పార్టీ బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు పార్టీలో ఉండి చేపట్టిన కార్యక్రమాలను అధిష్టానం గుర్తించి, పదవిని అందించిందని పలువురు కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్, మెంబర్స్ కి పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Advertisement

Next Story