- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
100 శాతం అక్షరాస్యత సాధించాలి
by Sridhar Babu |
X
దిశ, ఆసిఫాబాద్ : జిల్లాలో 100 శాతం అక్షరాస్యత సాధించేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నవభారత అక్షరాస్యత కార్యక్రమంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
నవభారత అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 100 శాతం అక్షరాస్యత సాధించేలా అధికారులు పనిచేయాలని సూచించారు. నిరక్ష్యరాస్యులను గుర్తించేందుకు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులను వాలంటీర్లుగా నియమించి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు, సహాయకులు తమ పరిధిలోని నిరక్ష్యరాస్యులను గుర్తించి వారి వివరాలు నమోదు చేయాలని కోరారు. సెర్ప్, మెప్మా సిబ్బంది కూడా ఇందుకు కృషి చేయాలని ఆదేశించారు.
Next Story