ప్రేమ పేరిట వల.. కిడ్నాప్ చేసి మైనర్ బాలికను..

by Rajesh |
ప్రేమ పేరిట వల.. కిడ్నాప్ చేసి మైనర్ బాలికను..
X

దిశ, వెబ్‌డెస్క్: 16 ఏళ్ల ఓ బాలికను ప్రేమించానని చెప్పాడు. ఓ ఆలయంలో బలవంతంగా పెళ్లి చేసుకుని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుడికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రూ.30వేల జరిమానా వేసింది. బాధిత బాలికకు రూ.3లక్షల నష్ట పరిహారాన్ని మంజూరు చేస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక ఫోక్సో కోర్టు న్యాయమూర్తి శుక్రవారం తుది తీర్పునిచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి.

నల్గొండ జిల్లా నేరెడుగొమ్ముకు చెందిన ఆలేటి ప్రభాకర్ (29) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి మీర్ పేట ఠాణా పరిధిలోని ఓ కాలనీలో ఉంటున్నాడు. ప్రభాకర్ 2016లో ఓ బాలికను ప్రేమిస్తున్నట్లు చెప్పి అదే ఏడాది జూన్ 5న కిడ్నాప్ చేశాడు. తుక్కుగూడలో బలవంగాం పెళ్లి చేసుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న మీర్ పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. కాగా తాజాగా నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష వేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

Next Story