కారును ఢీ కొట్టిన లారీ.. నలుగురికి తప్పిన పెను ప్రమాదం

by Rajesh |
కారును ఢీ కొట్టిన లారీ.. నలుగురికి తప్పిన పెను ప్రమాదం
X

దిశ, ఉప్పల్: కారును లారీ ఢీ కొట్టిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. సతీష్ అనే వ్యక్తి మియాపూర్ నివాసం ఉంటున్నాడు. ఈ రోజు ఉదయం శ్రీశైలం వెళ్లేందుకు ఫ్యామిలీతో బయలు దేరాడు. ఉదయం ఏడు గంటల సమయంలో కారు ఉప్పల్ రింగ్ రోడ్డు వద్దకు చేరుకోగానే రెడ్ సిగ్నల్ పడిందని కారును ఆపారు. గ్రీన్ సిగ్నల్ పడగానే వాహనాలు స్టార్ట్ అయ్యే సమయంలో కారుకు కుడి వైపు ఉన్న లారీ ఢీకొట్టింది. అయినా లారీ డ్రైవర్ భిక్షపతి అలాగే కారును ముందుకు పోనిచ్చాడు. దీంతో కారు కుడివైపు భాగం నుజ్జు నుజ్జు అయింది. కారు‌లో చిన్నపాపతో సహా ముగ్గురు వ్యక్తులు ఉండగా తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం కారణంగా ఉప్పల్ రింగ్ రోడ్‌లో ట్రాఫిక్ పెద్ద ఎత్తున జామ్ అయింది. స్థానిక పోలీసులు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసి కారు డ్రైవర్, లారీ డ్రైవర్‌‌లను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

Advertisement

Next Story