సెప్టెంబర్ 21నుంచి మావోయిస్టు పార్టీ 20వ వార్షికోత్సవాలు

by Y. Venkata Narasimha Reddy |
సెప్టెంబర్ 21నుంచి మావోయిస్టు పార్టీ 20వ వార్షికోత్సవాలు
X

దిశ, వెబ్ డెస్క్ : భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) 20వ వార్షికోత్సవాన్ని 21 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 20 వరకు తెలంగాణ వ్యాప్తంగా సమరోత్సహాంతో జరుపుకోవాలంటూ ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటనలో కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో తలపెట్టిన అప్రజాస్వామిక, అమానవీయ ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా రాజకీయ, సైనిక పోరాటాలలో విరోచితంగా తలపడి ఓడిద్దామని తన లేఖలో పేర్కొన్నారు. సీపీఐ మావోయిస్టు పార్టీగా అవతరించి ఈనెల 20వ తేదీకి 20 ఏళ్లు గడుస్తున్నాయని, ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ద్విదశాబ్ది ఉత్సవాలను మావోయిస్టు పార్టీ నిర్వహిస్తుందని తెలిపారు. పార్టీ, పీఎల్జీవీ, విప్లవ ప్రజానీకం ఐక్యమై ప్రజా యుద్ధానికి బలమైన ప్రజా పునాదిని వేద్దామని, పార్టీని. విప్లవోద్యమాన్ని కాపాడుకుందామని కోరారు.







Advertisement

Next Story

Most Viewed