జగన్ మళ్లీ జైలుకెళ్లడం ఖాయం.. తెలంగాణ టీడీపీ నేతల వార్నింగ్

by Aamani |
Telangana TDP leaders
X

దిశ, బెల్లంపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ జైలుకెళ్లడం ఖాయమని టీడీపీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు అమనుల్లా ఖాన్ హెచ్చరించారు. శనివారం బెల్లంపల్లి పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని మండిపడ్డారు. చంద్రబాబు వెనుక ఉమ్మడి రాష్ట్రాల ప్రజలు ఎల్లప్పుడూ ఉంటారని, రాబోయే ఎన్నికల్లో మళ్లీ టీడీపీనే అధికారంలోకి వస్తుందని అన్నారు. ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేస్తూ ఆత్మగౌరవం కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే జగన్ జైలు జీవితం గడిపినప్పటికీ ఇంకా బుద్ధి రాకపోవడం సిగ్గు చేటన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల పాలు చేస్తున్నారే తప్ప, అభివృద్ధి చేయడం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే వారికి బుద్ధి చెబుతారని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు ఎండీ సాధిక్, సత్యనారాయణ, మచ్చయ్య, బుక్రు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed