‘కన్ను పడితే కబ్జా, ఖాళీ చేయకపోతే జేసీబీలతో విధ్వంసం.. దటీస్ వైసీపీ సర్కార్’

by srinivas |   ( Updated:2021-06-06 05:31:27.0  )
Nara lokesh
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్నంలోని పెదవాల్తేరులో గల హిడెన్ స్ర్పౌట్స్ మానసిక దివ్యాంగుల పాఠశాల కూల్చివేతపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ట్వీట్టర్ వేదికగా వైసీపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ‘ విశాఖపట్టణ. అనధికారికంగా విజయసాయిరెడ్డి పట్టణమైపోయింది. కన్ను పడితే కబ్జా.. ఖాళీ చేయకపోతే జేసీబీలతో విధ్వంసం. పెద‌వాల్తేరులోని 190 మంది వివిధ ర‌కాల మాన‌సిక స‌మ‌స్యల‌తో ఉన్న పిల్లల‌కు విద్యాబుద్ధులు నేర్పుతోన్న హిడెన్ స్ప్రౌట్స్ పాఠ‌శాల‌ని ఏ2 రెడ్డి గ్యాంగులు క‌బ‌డ్డీ పేరుతో క‌బ్జా చేయాల‌ని చూశారు. సాధ్యం కాక‌పోయే స‌రికి రాజారెడ్డి రాజ్యాంగానికి అనువైన శ‌నివారం రోజు జేసీబీల‌తో కూల్చేశారు. మాన‌సిక దివ్యాంగులకు నీడ‌నిచ్చే పాఠ‌శాల‌కు సాయం చేయాల్సింది పోయి,ఆక్రమించిన వైకాపా నాయకుల పాపాలు పండే రోజు ద‌గ్గర ప‌డింది’ అంటూ పోస్టులు చేశారు.

Advertisement

Next Story

Most Viewed