టీడీపీ నేత పట్టాభిరామ్‌పై దాడి

by  |
టీడీపీ నేత పట్టాభిరామ్‌పై దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నేత పట్టాభిరామ్‌పై దాడి జరిగింది. ఇంటి నుంచి కార్యాలయానికి వెళ్తుండగా.. ఆయన ఇంటి దగ్గరే ఈ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది వ్యక్తులు పట్టాభి కారును చుట్టుముట్టి రాడ్లతో దాడి చేయగా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో పట్టాభిరామ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన పట్టాభిను ఆస్పత్రికి తరలించారు. సుమారు పది మంది దుండగులు దాడి చేశారని స్థానికులు చెబుతున్నారు.

పట్టాభిరామ్ మాట్లాడుతూ.. ఈ దాడి వెనుక మంత్రి కొడాలి నాని హస్తం ఉందని ఆరోపించారు. 15 మంది వచ్చి తనపై, తన వాహనంపై దాడి చేశారని చెప్పారు. 10 రోజులుగా తనకు బెదిరింపులు వస్తున్నాయని, ప్రభుత్వ అవినీతిని బయటపెడుతున్నాననే తనపై దాడి చేశారని తెలిపారు.

Next Story

Most Viewed