కరోనాతో ‘స్వాతి’ మ్యాగ్ జైన్ ఎండీ కుమార్తె మృతి..

by vinod kumar |   ( Updated:2021-05-11 00:22:06.0  )
కరోనాతో ‘స్వాతి’ మ్యాగ్ జైన్ ఎండీ కుమార్తె మృతి..
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి రోజురోజుకు తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. గతేడాది నుండి ఇప్పటివరకు ఈ మహమ్మారి బారిన పడి ఎంతోమంది ప్రముఖులు ప్రాణాలను విడిచారు. ఇక ఇటీవలే కరోనా తో ప్రముఖ జర్నలిస్ట్ టీఎన్ ఆర్ మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా స్వాతి వార పత్రిక అసోసియేట్ ఎడిటర్ మణిచందన కరోనా బారిన పడి సోమవారం ఉదయం మృతిచెందారు. తెలుగు వారికి స్వాతి వారపత్రిక ఎంతటి సుపరిచితమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సంస్థ ఎండీ వేమూరి బలరామ్ కుమార్తె మణిచందన స్వాతి వారపత్రికకు అసోసియేట్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. గతేడాది నుండి ఆమె క్యాన్సర్ తో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారం క్రితం ఆమె కరోనా బారిన పడడంతో చికిత్స నిమిత్తం విజయవాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే ఆమె సోమవారం ఉదయం కన్నుమూశారు. మణిచందన భర్త ఐటీ శాఖలో ప్రిన్సిపల్ కమిషనర్ గా పని చేస్తున్నారు. ఆమె స్వాతి వారపత్రిక విజయంలో ఒక కీలక పాత్ర పోషించారు. మణిచందన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed