- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
వెరీ గుడ్ ప్రశస్తిని.. విద్యార్థిని అభినందించిన కలెక్టర్ అభిలాష..
దిశ ప్రతినిధి, నిర్మల్ : జాతీయ పోటీల్లో మూడో స్థానం సాధించిన నిర్మల్ కు చెందిన విద్యార్థిని కలెక్టర్ అభిలాష అభినవ్ అభినందించారు. వేదం గ్లోబల్ స్కూల్ కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని చిన్నోళ్ల ప్రశస్తిని 'ఇండియా ఈస్ ఆస్' స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన భారతదేశపు ప్రీమియర్ క్రియేటివిటీ నేషనల్ అండ్ ఇంటర్ స్కూల్ పెయింటింగ్, రైటింగ్ పోటీల్లో భాగంగా పవిత్ర స్వేచ్ఛ అనే అంశం పై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో జాతీయస్థాయిలో మూడవ స్థానంలో నిలిచి ఉత్తమ ప్రతిభ చాటింది.
సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామానికి చెందిన రాజ్ కుమార్ రెడ్డి కూతురు ప్రశస్తిని బాల్యం నుండి చదువుతో పాటు ఇతర కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటోంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థిని చిన్నోళ్ల ప్రశస్తిని జాతీయస్థాయిలో మూడవ స్థానంలో నిలవడం గర్వించదగ్గ విషయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధించాలని ఆకాంక్షించారు. ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థినికి, ఆమెను ప్రోత్సహించిన ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు భూపాల్ రెడ్డి, ప్రవళిక రెడ్డి తదితరులు పాల్గొన్నారు.