ఇదో వింత : గుడ్లు పెడుతున్న కోడిపుంజు.. పిల్లల్ని చేస్తూ మరీ

by Sampath |
ఇదో వింత : గుడ్లు పెడుతున్న కోడిపుంజు.. పిల్లల్ని చేస్తూ మరీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఎవరైనా కోడిపుంజు సెలబ్రెటీ అవ్వడం చూశారా.. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఓ కోడిపుంజు సెలబ్రెటీ అయిపోయింది. ఎలా.. అనుకుంటున్నారా.. ప్రపంచంలో చాలా వింతలు విడ్డూరాలు చోటు చేసుకుంటాయి. ఇక ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి వింతలు, విడ్డూరాలకు కొదవ లేకుండా పోయింది. ఎక్కడెక్కడో జరిగిన వింతలను మనం సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాం. ఇప్పుడు కూడా అలానే చిత్తూరు జిల్లాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది.

అప్పుడప్పుడు మనం వింటుంటాం.. వింత శిశువుల జననం, పందులు ఆవు పాలు తాగడం, ఆవు కడుపులో మనిషి జన్మించడం, మేక మనిషిలా జన్మించడం. వీటిని చూసిన కొందరు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారని అంటూ ఉంటారు కదా.. అలా ఓ కోడిపుంజు ఏకంగా గుడ్లు పెట్టేస్తూ పిల్లల్ని పొదుగుతోంది. ఈ వింత ఘటన చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం పెద్దకన్నలి గ్రామంలోని చోటు చేసుకుంది. గ్రామంలోని ఎస్టీకాలనీలో ఉంటున్న సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి చెందిన ఓ కోడి పుంజు గుడ్లు పెట్టడం ఆయన గమనించాడు. అంతే కాకుండా అది పెట్ట కోడిలా గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలు కూడా చేసింది. అంతే కాకుండా ఓ తల్లిపెట్ట తన పిల్లల్ని ఎంత భద్రంగా కాపాడుకుంటుందో ఈ పుంజు కూడా తన పిల్లల్ని అంతే భద్రంగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కోడిపుంజు గుడ్లు పెట్టడంపై పశుసంవర్ధక అధికారులను సంప్రదించగా జన్యులోపం వల్ల ఇలా గుడ్లుపెడతాయని.. ప్రస్తుతం ఆ కోడిపుంజు ఆరోగ్యంగానే ఉందని చెప్పారు. దీంతో ఆ కోడి పుంజు చిత్తూరు జిల్లాలో సెలబ్రెటీ అయిపోయింది.

Advertisement

Next Story

Most Viewed