ఆ ఆలయంలో… ఎలక్షన్ కమిషనర్ ప్రత్యేక పూజలు

by  |
ఆ ఆలయంలో… ఎలక్షన్ కమిషనర్ ప్రత్యేక పూజలు
X

దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయం ఆవరణలోని విగ్నేశ్వర ఆలయంలో రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ పార్ధ సారధి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దిపేట పర్యటన నిమిత్తం వచ్చిన ఆయనకు కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్‌లు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు పుష్పగుచ్చాన్ని అందించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతించగా ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, గజ్వేల్ ఏసీపీ నారాయణ, ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed