వచ్చే నెల 22 నుంచే డబ్ల్యూపీఎల్?

by Harish |   ( Updated:2024-01-21 15:15:06.0  )
వచ్చే నెల 22 నుంచే డబ్ల్యూపీఎల్?
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ నిర్వహణకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 22 నుంచి ఈ టోర్నీ ప్రారంభంకానున్నట్టు తెలుస్తోంది. బెంగళూరు వేదికగా టోర్నీ ప్రారంభమవుతుందని ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ తెలిపింది. గతేడాది ప్రారంభ సీజన్ ముంబైకి మాత్రమే పరిమితమవ్వగా.. ఈ సీజన్‌కు రెండు వేదికలు ఆతిథ్యమివ్వనున్నాయి. బెంగళూరు, ఢిల్లీ వేదికగా మ్యాచ్‌లు జరుగుతాయని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఇటీవల స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. అయితే, మొదటి భాగం మ్యాచ్‌లు బెంగళూరులో.. రెండోవ భాగం మ్యాచ్‌లు ఢిల్లీలో జరగనున్నట్టు తెలుస్తోంది. ఫైనల్ మ్యాచ్ ఢిల్లీ వేదికగానే నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. కాగా, ప్రారంభ సీజన్‌లో ముంబై ఇండియన్స్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

Read More..

ఏషియన్ మారథాన్ చాంపియన్‌గా మాన్‌సింగ్

Advertisement

Next Story

Most Viewed