IND VS NZ : తొలి టెస్టులో ఓటమి.. భారత జట్టులోకి కీలక ప్లేయర్

by Harish |
IND VS NZ : తొలి టెస్టులో ఓటమి.. భారత జట్టులోకి కీలక ప్లేయర్
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తిరిగి భారత టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. న్యూజిలాండ్‌తో మిగతా రెండు టెస్టులకు సెలెక్టర్లు అతన్ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని బీసీసీఐ ఆదివారం వెల్లడించింది. పుణెలో జరిగే రెండో టెస్టు ప్రారంభానికి ముందు అతను జట్టుతో కలవనున్నట్టు తెలిపింది. 2021 మార్చిలో ఇంగ్లాండ్‌పై అతను చివరిసారిగా టెస్టు ఆడాడు. దాదాపు మూడున్నర ఏళ్ల తర్వాత సుందర్ టెస్టు జట్టులో చోటు సంపాదించాడు. ప్రస్తుతం సుందర్ రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు. తమిళనాడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతను ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో శనివారం భారీ శతకం(152) బాదాడు. మరుసటి రోజే సుందర్‌కు టెస్టు జట్టులో దక్కడం గమనార్హం. సుందర్ ఆల్‌రౌండ్ సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జట్టులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 24 నుంచి రెండో టెస్టు ప్రారంభంకానుంది.

Advertisement

Next Story