మరికొద్ది క్షణాల్లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ ఫైనల్ మ్యాచ్.. తలపడనున్న భారత్, పాకిస్తాన్ జట్లు

by Mahesh |
మరికొద్ది క్షణాల్లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ ఫైనల్ మ్యాచ్.. తలపడనున్న భారత్, పాకిస్తాన్ జట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ ఫైనల్‌కు పాకిస్తాన్, భారత ఛాంపియన్స్ జట్లు చేరుకున్నాయి. దాయాదులు ఈ రోజు రాత్రి 9 గంటలకు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ వేదికగా జరుగుతుంది. కాగా ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నిలో యువరాజ్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు ఐందు మ్యాచుల్లో రెండు విజయాలతో ఫైనల్స్ కు చేరుకుంది. అలాగే పాకిస్థాన్ ఛాంపియన్ జట్టు ఐదు గేమ్‌లలో నాలుగు గెలిచి ఫైనల్‌లోకి ప్రవేశించింది. కాగా రాత్రి 9 గంటలకు జరిగే ఈ మ్యాచ్ భారత్ vs పాకిస్తాన్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల దృష్టిని తన వైపు తిప్పుకుంది. అయితే ప్లాట్ ఫామ్ ఎదైన పాకిస్తాన్ జట్టుపై భారత జట్టు విజయ పరంపరను కొనసాగిస్తుందనే సెంటిమెంట్‌కు పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్టు చెక్ పెడుతుందా.. లేక సెంటిమెంటును ఫాలో అవుతుందో తెలియాలంటే మ్యాచ్ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే మరి.



Next Story